అదే జోరు.. అదే జోష్.. అదే హిస్టరీ..! సీజన్ సీజన్కు కొత్త కుర్రాళ్లు వచ్చినా... విక్టరీ మాత్రం మనదే..! ఎంత మంది అపోనెంట్స్ మారినా.. కప్ మాత్రం మనదే..! గతంలో ఎవరూ సాధించని స్థాయిలో.. యంగ్ ఇండియా ఐదోసారి అండర్–19 వరల్డ్కప్ను సాధించింది..! అండర్–19 వరల్డ్కప్లో యంగ్ ఇండియా ఖతర్నాక్ ఆటతో చెలరేగిపోయింది. లీగ్ దశలో చూపెట్టిన సూపర్ పెర్ఫామెన్స్ను టైటిల్ ఫైట్లోనూ కంటిన్యూ చేసింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్ను ఖాతాలో వేసుకుంది.
అయితే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి ప్రైజ్ మనీ ప్రకటించింది. ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.40 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్ కు రూ. 25 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది.
‘అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు జట్టు సభ్యులు ఒక్కొక్కరకి రూ. 40 లక్షలు మరియు సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల రివార్డును ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను. మీరు భారతదేశాన్ని గర్వించేలా చేశారు. అన్ని అడ్డంకులను అధిగమించి సాధించిన ఈ గెలుపు.. వీవీఎస్ లక్ష్మణ్ కు వెరీ వెరీ స్పెషల్. ఈ క్లిష్ట సమయాల్లో మన ప్రతి యంగ్ ప్లేయర్ చరిత్ర సృష్టించడానికి అవసరమైన తమ దూకుడును చూపించారు’అని జై షా సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. గ్రూప్ స్టేజ్లలో జట్టు సభ్యులు కోవిడ్ బారినపడినా కూడా జట్టు ఏమాత్రం బెదరకుండా ఆడిందని జై షా అన్నారు.
I’m pleased to announce the reward of 40 lacs per player and 25 lacs per support staff for the U19 #TeamIndia contingent for their exemplary performance in #U19CWCFinal. You have made ?? proud. @SGanguly99 @ThakurArunS @ShuklaRajiv
— Jay Shah (@JayShah) February 5, 2022
For More News..