భారత క్రికెట్ సమర్థుల చేతుల్లో ఉంది

భారత క్రికెట్ సమర్థుల చేతుల్లో ఉంది

అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌లో యంగ్‌‌ ఇండియా ఖతర్నాక్‌‌ ఆటతో చెలరేగిపోయింది. లీగ్‌‌ దశలో చూపెట్టిన సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ను టైటిల్‌‌ ఫైట్‌‌లోనూ కంటిన్యూ చేసింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌ను ఓడించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్‌‌ను ఖాతాలో వేసుకుంది.

కప్ సాధించిన ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. యువ క్రికెటర్లను చూసి చాలా గర్వంగా ఉందని అన్నారు. వీరి ఆటతీరుతో భారత క్రికెట్ సురక్షితంగా ఉందని మోడీ అన్నారు.

‘మన యువ క్రికెటర్లను చూసి చాలా గర్వపడుతున్నాను. ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు అభినందనలు. ఈ టోర్నీ ద్వారా వారు గొప్ప సత్తా చాటారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వారి అద్భుతమైన ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితంగా మరియు సమర్థుల చేతుల్లో ఉందని నిరూపితమైంది’ అని మోడీ ట్వీట్ చేశారు.