
ముంబై: గతంలో ల్యాప్సయిన పాలసీలను రివైవ్ చేసుకోమంటూ కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక క్యాంపెయిన్ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పాలసీ టర్మ్ పూర్తి కాని, ల్యాప్సయిన పాలసీలను ఈ గడువులో రివైవ్ చేసుకోమని కస్టమర్లకు సూచిస్తోంది. ఈ నెల 7 నుంచి మార్చి 25 దాకా ఇందుకోసం గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. కొవిడ్–19 తో ఇన్సూరెన్స్ విలువ మరింత పెరిగిన నేపథ్యంలో పాలసీ హోల్డర్లకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు ఎల్ఐసీ వివరించింది. జీవితానికి భద్రత కల్పించుకోవడానికి, కుటుంబ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఈ చర్య సాయపడుతుందని భావిస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది. లేట్ ఫీలో కన్సెషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే చెల్లించిన టోటల్ ప్రీమియం ఆధారంగా ఈ కన్సెషన్ ఉంటుందని వివరించింది. మెడికల్ రిక్వైర్మెంట్లకు ఎలాంటి కన్సెషన్లూ ఉండవని, హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లకూ లేట్ ఫీలో కన్సెషన్ ఉంటుందని ఎల్ఐసీ పేర్కొంది. తమకు రావాల్సిన ప్రీమియం రూ. లక్ష దాకా ఉంటే దానిపై లేట్ఫీలో 20 శాతం దాకా (మాగ్జిమం రూ. 2 వేలు) కన్సెషన్ ఉంటుందని వివరించింది. ఇక మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లపై లేట్ ఫీకి పూర్తి కన్సెషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రీమియం చెల్లించడం మానేసి అయిదేళ్ల లోపయిన ఎలిజిబుల్ పాలసీలను రివైవ్ చేసుకోవచ్చని, ఇందుకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్లు ఉన్నాయని ఎల్ఐసీ ఈ స్టేట్మెంట్లో వివరించింది.