
తిరువనంతపురం: భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, శాస్త్రవేత్తలకు కూడా మెరుగైన పని వాతావరణం ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.2040 నాటికి ఈ సంఖ్య 100 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఏకేడీ వంటి కొన్ని విదేశీ ఏజెన్సీలు అంచనా వేసినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ (ఇండిపెండెంట్ ఛార్జ్) సహాయ మంత్రి అయిన సింగ్ తెలిపారు.
ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంతగా ఆకర్షణీయంగా లేదు. పెట్టుబడులు భారీగా లేవు. మనం వేగంగా దూసుకెళ్తున్నాం. విదేశీ ఉపగ్రహ ప్రయోగాలు బాగా జరుగుతున్నాయి. మేం యూరోపియన్ ఉపగ్రహాలను ప్రయోగించినందుకు దాదాపు 230–240 మిలియన్ల యూరోలను సంపాదించాం. అమెరికా ఉపగ్రహాలను ప్రయోగించడానికి సుమారు 170–-180 మిలియన్ల డాలర్లు వచ్చాయి" అని మంత్రి చెప్పారు. తిరువనంతపురంలో ఇస్రో రాకెట్ ప్రయోగ 60వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘అనుసంధాన్’తో ఎన్నో విజయాలు సాధించవచ్చని ఆర్కే సింగ్ అన్నారు.