ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడో .. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో అప్రూవల్ కాని ఇందిరమ్మ కమిటీలు

ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడో .. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో అప్రూవల్ కాని ఇందిరమ్మ కమిటీలు
  • కమిటీలు ఫైనల్ కాకపోవడంతో పూర్తికాని అర్హుల ఎంపిక 
  • అర్హులకు తప్పని ఎదురుచూపులు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంటే.. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం ఈ స్కీమ్ అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. నిబంధనల ప్రకారం లబ్ధిదారుల జాబితాను ఇందిరమ్మ కమిటీలు ఆమోదించాల్సి ఉండగా.. ఇప్పటివరకు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో కమిటీల ఊసేలేదు. గతంలో నియోజకవర్గం నుంచి ఒక్కో గ్రామం, డివిజన్ నుంచి రెండేసి ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కమిటీలు ఫైనల్ కాకపోవడంతో నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 

పేదలకు తప్పని ఎదురుచూపులు

అన్ని నియోజకవర్గాల్లో ఇళ్లు కట్టుకుంటుంటే.. కరీంనగర్ పేదలకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. కరీంనగర్  నియోజకవర్గంలో పైలట్ గ్రామాల కింద కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో 194, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో 106 ఇళ్లు శాంక్షన్ చేశారు. ఇందులో సగానికిపైగా ఇళ్ల నిర్మాణం మొదలైంది. వీటితోపాటు కరీంనగర్ సిటీతోపాటు ఇతర మండలాల్లో ఇందిరమ్మ కమిటీలు లేని కారణంగా ప్రభుత్వం మంజూరు చేసిన 3,270 ఇళ్లకు ఇంకా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. 

ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 1,737 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం 40,773 దరఖాస్తులు రాగా.. ఇందులో స్థలం ఉండి ఇల్లు లేనివాళ్లు(ఎల్1) 2,304  మంది ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. స్థలం, ఇల్లు రెండూ లేని కుటుంబాలు(ఎల్2) 25,978 ఉన్నాయి. ఈ కుటుంబాలు అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు. ఇల్లు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్నవారిని అనర్హులుగా గుర్తించారు. ఇలాంటి దరఖాస్తులు 12,491 వచ్చాయి. వీరంతా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు.

ఆధిపత్య పోరుతో ముందుకు పడని అడుగు..  

కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయలోపం, ఆధిపత్య పోరుతోనే ఇందిరమ్మ కమిటీలు కొలిక్కి రావడం లేదని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిగా పని చేసిన సమయంలో పురుమల్ల శ్రీనివాస్ ఇందిరమ్మ కమిటీల సభ్యుల జాబితాను అప్పటి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. ఆ జాబితాలో మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు స్థానం లేదని భావించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.. సిటీలోని 6 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డివిజన్లకు సంబంధించిన ఇందిరమ్మ కమిటీల జాబితాను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రికి పంపారు. 

మరోవైపు ఈ రెండు జాబితాలపైనా మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అభ్యంతరాలు ఉన్నట్లు తెలిసింది. రెండు జాబితాల్లో దేనికి మంత్రి ఉత్తమ్ ఆమోద ముద్ర వేయలేదు. ఇటీవల జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును నియమించిన విషయం తెలిసిందే. మంత్రి తుమ్మలనైనా ప్రత్యేక దృష్టి సారించి కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలను ఫైనల్ చేసిన అర్హులకు ఇండ్లు వచ్చేలా చూడాలని నియోజకవర్గ వాసులు  కోరుతున్నారు.