ఉన్నట్టా…లేనట్టా

ఉన్నట్టా…లేనట్టా
  • 13న నిర్ణయం తీసుకోనున్న సీఓఏ

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌ కు తగిన బుద్ది చెప్పి.. ఆ దేశాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు ఇండియా ప్రయత్నిస్తోంది . ఇందులో భాగంగా పాక్‌ తో క్రికెట్‌ బంధాన్నికూడా పూర్తిగా తెంచుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. వచ్చే వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌ లో పాకిస్తాన్‌ తో  మ్యాచ్ ను టీమిండియా బాయ్‌ కాట్‌ చేయాలని  క్రికెటర్లతో పాటు రాజకీయ నాయకులు డిమాం డ్‌ చేస్తున్నారు.  రెండు దేశాల మధ్య  ద్వైపాక్షిక  క్రికెట్‌బంధం తెగిపోయి దశాబ్దం అవుతుండగా.. ఇప్పుడు అంతర్జా తీయ టోర్నీల్లో కూడా పాక్‌ తో క్రికెట్‌ ఆడకూడదని అభిప్రాయపడుతున్నారు. దాం తో, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఇండో–పాక్‌ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ  రెండు దేశాల్లోనే కాదు క్రికెట్‌ ప్రపంచంలో ఇప్పుడు హాట్‌ టాపి క్‌ గా మారింది . పాక్‌ తో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఆడొద్దని టీమిండియా ఆటగాడు హర్భజన్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు . మెగా టోర్నీలో పాక్‌ తో పోరు లేకున్నా కూడా ఇండియా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్ నెగ్గలేదని  అతను అభిప్రాయపడ్డాడు . మే 30న ఇంగ్లం డ్‌ లో మొదలయ్యే ప్రపంచకప్‌ లో ఇండియా జూన్‌ 16న పాక్‌ తోఆడనుంది . అయితే, ఈ మ్యాచ్‌ పై బీసీసీఐ ఇప్పటికి ఎలాం టి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. బహుశా దుబాయ్‌ లో వచ్చే వారంలో జరి గే ఐసీసీ సమావేశాల్లో దీనిపై బీసీసీఐ చర్చించే అవకాశం కనిపిస్తోంది .వారం రోజుల పాటు జరిగే ఈ మీటిం గ్‌ లో ఐసీసీ ఫోరమ్‌ ముందు ఇండో–పాక్‌ మ్ యాచ్‌ చర్చకు రావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే  బీసీసీఐ ఆలోచన ఏమిటో తెలియదు. అయితే,వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ మ్ యాచ్‌ ల్లో మార్పు ఉండబోదని అంటున్నఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూ టివ్‌ డేవ్‌ రిచర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌ .. ఇండో–పాక్‌ పోరు షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం జరుగుతుందని పరోక్షంగా సూచించారు. ఇండియాలో ఉగ్రదాడి దరిమిలా క్రికెట్‌ పై ప్రభావాన్ని తమ సభ్య దేశాలతో చర్చిస్తామన్నారు. మరోవైపు తమతో క్రికెట్‌ విషయంపై బీసీసీఐ తీసుకునే నిర్ణయం ఆధారంగా ఐసీసీతోనే తేల్చుకుం టామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది . పాకిస్తాన్‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌ (పీఎస్‌ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నుంచి ఇండియాకు చెంది న స్టేక్‌ హోల్డర్ లుతప్పుకోవడాన్ని కూడా ఐసీసీ సమావేశాల్లో లేవనెత్తు తామని తెలిపింది . ఈ పరిణామాలన్నింటి తర్వాత వరల్డ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో పాక్‌ తో పోరును బాయ్‌ కాట్‌ చేసి శత్రు దేశానికి బుద్ది చెప్పాలని మాజీ ప్లేయర్లు, బీసీసీఐ అధికారులు సూచిస్తున్నారు. కానీ, బోర్డు , ఇండియా టీమ్‌ మేనేజ్‌ మెంట్ మాత్రం దీని పై ఇప్పుడే ఒక ని ర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని భావిస్తోంది . ఆస్ట్రే లియా–ఇండియా వన్డే సిరీ స్‌ సందర్భం గా టీమ్‌ మేనే జ్‌ మెం ట్‌ , సీఓఏ సభ్యులు సమావేశమై ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలో వచ్చే నెల 13న జరిగే ఐదో వన్డే సందర్భం గా ఈ భేటీ జరగొచ్చు . ఇందులోనే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ సన్నాహాకాలు, పాక్‌ తో మ్యాచ్‌ పై నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉంది. ఈ సమావేశంలోనే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే ఇండియా ప్లేయర్ల (వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఆడే వారు) వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌ మేనేజ్‌ మెంట్‌ గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది .