నిమిషాల్లోనే మొత్తం ఖాళీ

నిమిషాల్లోనే మొత్తం ఖాళీ

న్యూఢిల్లీ: ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టిక్కెట్లు హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేకుల్లా అమ్ముడుపోయాయి. సోమవారం రాత్రి టిక్కెట్లను అమ్మకానికి పెట్టగా నిమిషాల్లోనే మొత్తం ఖాళీ అయ్యాయి. దీంతో టిక్కెట్లు లభించక చాలా మంది నిరాశకు గురయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అమ్మకాలు ఉంటాయని నిర్వాహకులు ముందుగానే ప్రకటించడంతో టిక్కెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. దీంతో అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది.

రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యూ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చారు. దీంతో మధ్యాహ్నం 12  గంటల వరకే ఏడున్నర లక్షల మంది బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. అయితే టిక్కెట్లు తక్కువగా ఉండటంతో రాత్రి అమ్మకాలు మొదలుపెట్టిన నిమిషాల్లోనే మొత్తం అయిపోయాయి. ఇరుజట్ల మధ్య ఈ హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈనెల 28న జరగనుంది.