ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి : ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్ కిశోర్

ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి : ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్ కిశోర్

బోధన్, వెలుగు : ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నివారించి.. పర్యావరణాన్ని కాపాడాలని ఇందూర్ స్కూల్​ కరస్పాండెంట్ కొడాలి కిశోర్ ​పిలుపునిచ్చారు. శనివారం బోధన్​ పట్టణంలోని ఇందూర్ స్కూల్​ప్లాస్టిక్​నివారణ, పర్యావరణ రహిత వస్తువుల వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలోని  ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఎకో క్లబ్​ను ఏర్పాటు చేశారు. ఆచన్​పల్లిలో ర్యాలీ నిర్వహించి పట్టణవాసులకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. 

విద్యార్థులు, ఉపాధ్యాయులు పాత వస్తువులతో తయారు చేసిన 400 సంచులను ఆచన్​పల్లి, బైపాస్ రోడ్డు, ఆచన్​పల్లి వీధుల్లో తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. ప్లాస్టిక్​వల్ల జరిగే అనర్థాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన 15 మంది విద్యార్థులకు బహుమతులు, పూల మొక్కలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాల అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్ స్వాతి, హెచ్ఎం రామారావు, టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.