ఈ నెల 28 నుంచి ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో

ఈ నెల 28 నుంచి ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో

హైదరాబాద్​, వెలుగు: నగరానికి చెందిన తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్​టీసీసీఐ) ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో – 2023ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఇది హెచ్ఐసీసీలో జరగనుంది. ఫెడరేషన్ హౌస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ ప్రెసిడెంట్​ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ, తొలిసారిగా తాము ఇలాంటి ఎక్స్‌‌‌‌‌‌‌‌పో నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి ఐసీఐసీఐ, ఫోర్ సోలార్, క్వాంటం ఎనర్జీ, స్టాండర్డ్ కిచెన్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్,  పోకర్ణ, టీఎస్​ఐఐసీ, టీఎస్​ఆర్ఈడీసీఓ, ఐఐఎంఆర్​, ఎంఎస్​ఎంఈ మంత్రిత్వ శాఖ, ఇక్రిశాట్​, బీఎన్​ఐ, టీ– వర్క్స్, టీఎస్​టీపీసీ వంటి ప్రభుత్వ, ప్రైవేటు 128 సంస్థలు రానున్నాయని వెల్లడించారు.

వియత్నాం, మారిషస్​, బెల్జియం, రస్​ అల్​ఖైమా నుంచి ప్రతినిధుల బృందాలు వస్తాయని చెప్పారు. మొత్తం 150  స్టాల్స్​ ఏర్పాటవుతాయని,  ఇది బీ2బీ ఎగ్జిబిషన్​ అని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీలను, ఇన్నోవేషన్లను ఎంకరేజ్​చేసి ఆత్మనిర్భర్ భారత్ చొరవకు తోడ్పాటును ఇవ్వడానికే ఈ ప్రయత్నమని అగర్వాల్​ అన్నారు.