బిట్​ బ్యాంక్​ : నిజాం రాజ్యంలో పారిశ్రామీకరణ

బిట్​ బ్యాంక్​ : నిజాం రాజ్యంలో పారిశ్రామీకరణ

* హైదరాబాద్​ రాజ్యంలో పారిశ్రామీకరణ మూడు దశల్లో జరిగింది. మొదటి దశ 1870 –1918 వరకు (నిజాం దివానుగా సాలార్​జంగ్​ ఉన్న కాలం నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ఆఖరి వరకు), రెండో దశ 1919 నుంచి 1939 వరకు ( రెండో ప్రపంచ యుద్ధాల మధ్యకాలం), మూడో దశ1939 నుంచి 1948 వరకు (రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం నుంచి నిజాం రాజుల పాలన అంతమయ్యే వరకు). 

* 1899లో హైదరాబాద్​ గోదావరి వ్యాలీ రైల్వే లైన్​ను మాన్మాడ్​కు కలుపుతూ ఏర్పాటు చేయడం వల్ల పత్తి, దానికి సంబంధించిన స్పిన్నింగ్​, జిన్నింగ్​ పరిశ్రమలు నెలకొల్పడానికి తోడ్పడింది. 

*1877లో హైదరాబాద్​ దక్కన్​ స్పిన్నింగ్​, వీవింగ్​ మిల్స్​ లిమిటెడ్​ ఏర్పాటు చేశారు. 

*1884లో మహబూబ్​షాయి గుల్​బర్గామిల్స్​, 1888లో ఔరంగాబాద్​  మిల్స్​ నెలకొల్పారు. 

*1901 వరకు నిజాం రాజ్యంలో 68 పరిశ్రమలు ఉండేవి. 

*1911 – 1922 మధ్య పరిశ్రమలు 121 నుంచి 200కు పెరిగాయి.

* నిజాం రాజ్యంలో 1917లో ఇండస్ట్రియల్​ లేబరేటరీని ఏర్పాటు చేసి, పరిశోధనలు చేపట్టారు. 

* నిజాం రాజ్యంలో1918లో ప్రత్యేక కామర్స్​ ఇండస్ట్రీస్​ డిపార్ట్​మెంట్​ను రూపొందించారు. 

* నిజాం ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కోటి రూపాయలతో 1929లో ఇండస్ట్రియల్​ ట్రస్ట్​ ఫండ్​ ఏర్పాటు చేశారు.

* హైదరాబాద్​ రాజ్యంలో పారిశ్రామిక వస్తువుల ప్రదర్శన మొదట 19వ శతాబ్ది మధ్య భాగంలో మొదటి సాలార్​జంగ్​ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది.  

*ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్​ అసోసియేషన్​ అనే సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనలు హైదరాబాద్​లో 1930 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించడం ప్రారంభమైంది. 

* చిన్నతరహా పరిశ్రమల ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్​ అసోసియేషన్​ అనే సంస్థ ముల్కీ ఇండస్ట్రీస్​ పత్రిక నిర్వహించారు. 

* చిన్నతరహా ప్రోత్సాహానికి కాలేజ్​ ఇండస్ట్రియల్​ ఇన్​స్టిట్యూట్​(సీఐఐ)ను ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్​ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. 

* 1938–39 నాటికి నిజాం సాగర్​ ద్వారా జరిగే జల విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యం 20 మిలియన్ల కిలోవాట్స్​కు చేరింది.  

* 1916–19లో నిజాం రాజ్యంలో బొగ్గు ఉత్పత్తి 0.65 మిలియన్​ టన్నులు. 

* 1936–38లో నిజాం రాజ్యంలో బొగ్గు ఉత్పత్తి మిలియన్​ టన్నులు. 

* 1921లో 200గా ఉన్న భారీ పరిశ్రమల సంఖ్య 1931 నాటికి 387కు చేరింది. 

* 1920 ఫిబ్రవరి 14న హైదరాబాద్​ లోయర్​ ట్యాంక్​ బండ్​ వద్ద డి.బి.ఆర్​.మిల్స్​(దివాన్​ బహదూర్​ రాంగోపాల్​ మిల్లు) అనే బట్టల మిల్లును స్థాపించారు. 

* సింగరేణి కాలరీస్​ కంపెనీకి ముందు తెలంగాణలో బొగ్గు గనులు తవ్వడం హైదరాబాద్​ మైనింగ్​ కంపెనీ అనే ఒక లండన్​ సంస్థ ప్రారంభించింది. 

* 1921లో సింగరేణి కాలరీస్​ కంపెనీ(ఎస్.సి.సి.) ఏర్పాటు చేశారు. 

*తొలి బొగ్గు గనులు ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే గ్రామంలో బయటపడినందున సింగరేణి కాలరీస్​ కంపెనీ అనే పేరు పెట్టారు. 

* నిజాం చక్కెర పరిశ్రమను 1937లో నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​ పట్టణంలో ఏర్పాటు చేశారు. 

*ఆల్విన్​ మెటల్​ వర్క్స్​ను 1942లో నిజాం ప్రభుత్వం ఇండస్ట్రియల్​ ట్రస్టు ఫండ్​, మెస్సర్స్​ అల్లావుద్దీన్​ కంపెనీ ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు. 

* ప్రాగాటూల్స్​ను 1943 మేలో కవాడిగూడలో ఏర్పాటు చేశారు. 1963లో ప్రాగాటూల్స్​ను రక్షణ మంత్రిత్వశాఖకు అప్పగించారు. 
భారతదేశం స్థాపించిన మొదటి కాగితపు మిల్లుల్లో ఒకటైన సిరిపూర్​ పేపర్​ మిల్లు నుంచి 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. 
ఆదిలాబాద్​ జిల్లాలోని సిరిపూర్​ కాగజ్​నగర్​లో సిరిపూర్ పేపర్​ మిల్లు ఉంది.

ALSO READ :దామోదర​ రాజనర్సింహను నిలదీసిన మహిళలు 

* సిమెంట్​ రేకుల తయారీకి 1946 జూన్​ 17న హైదరాబాద్​ ఆస్ బెస్టాస్​ కంపెనీ ప్రారంభమైంది. 

* వజీర్​ సుల్తాన్​ టుబాకో (వీఎస్​టీ) పరిశ్రమను తొలుత 1916లో హైదరాబాద్​లోని విటల్​వాడిలో ప్రారంభించారు. 

* వీఎస్​టీ పరిశ్రమను మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ప్రస్తుతం ఉన్న ముషీరాబాద్​ ఆజామాబాద్​ ప్రాంతానికి 1916లో మార్చారు. 

* 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు 200 ఎకరాల విస్తీర్ణం కలిగిన ముషీరాబాద్​ – ఆజామాబాద్​ ప్రాంతాన్ని పరిశ్రమల స్థాపనకు కేటాయించారు. 

* జిందా తిలస్మాత్​ను 1920లో హకీం మహ్మద్​ మొహినుద్దీన్​ ఫారూఖీ స్థాపించారు. 

* వరంగల్​లో స్థాపించిన పరిశ్రమల్లో అతి ముఖ్యమైన ఆజమ్​జాహి మిల్స్​ అనే బట్టల ఉత్పత్తి పరిశ్రమను 1934లో ఏర్పాటు చేశారు. 

* స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ హైదరాబాద్​ను నిజాం కాలంలో హైదరాబాద్​ స్టేట్​బ్యాంక్​ పేరుతో పిలిచేవారు. 

* స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ హైదరాబాద్​ను ప్రభుత్వ బ్యాంక్​గా మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ 1941లో ప్రారంభించారు. 

* బ్రిటీష్​ ఇండియా కింద ఉన్న అన్ని సంస్థానాల్లో సొంత కరెన్సీ చలామణి చేసుకునే హక్కు నిజాం రాజ్యానికి మాత్రమే ఉండేది. 

* దక్కన్​ విమానయాన సంస్థను 1945లో నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్​లైన్స్​ కంపెనీ ఉమ్మడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది.