బిగ్​ 5 వల్లే ఇన్​ఫ్లేషన్​  తగ్గడం లేదు : ఆర్​బీఐ మాజీ  డిప్యూటీ గవర్నర్

బిగ్​ 5 వల్లే ఇన్​ఫ్లేషన్​  తగ్గడం లేదు : ఆర్​బీఐ మాజీ  డిప్యూటీ గవర్నర్

ముంబై: దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ల కారణంగానే ఇన్​ఫ్లేషన్​ తగ్గడం లేదని ఆర్​బీఐ మాజీ  డిప్యూటీ గవర్నర్ విరళ్​ ఆచార్య చెప్పారు. ​ రిటెయిల్​, రిసోర్సెస్​, టెలికమ్యూనికేషన్స్​ రంగాలలో ధరల నిర్ణయంలో కీలకపాత్ర పోషిస్తున్న అయిదు పెద్ద కార్పొరేషన్లు...రిలయన్స్​గ్రూప్​, టాటా గ్రూప్​, ఆదిత్య బిర్లా గ్రూప్​, అదానీ గ్రూప్​..భారతి టెలికంలను విడగొట్టడం బెటరని ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​ విరళ్​ ఆచార్య సూచించారు. దేశంలోని చిన్న బిజినెస్​లకు మనుగడ లేకుండా చేసే, ఈ అయిదు కార్పొరేషన్లు భారీగా ఎదగగలిగాయని పేర్కొన్నారు. విదేశీ కంపెనీల పోటీ తట్టుకునేందుకు ఈ బిగ్ 5 కార్పొరేట్లకు ప్రభుత్వం కూడా సాయపడిందని, అదెలాగంటే, చాలా వస్తువులపై అధిక డ్యూటీలను కొనసాగించడం ద్వారానేనని విరళ్​ ఆచార్య వివరించారు. నేషనల్​ ఛాంపియన్లను సృష్టించాలనేదే న్యూ ఇండియా ఇండస్ట్రియల్​ పాలసీగా అనుకుంటున్నారని, ఇదే నేరుగా దేశంలో రేట్లు ఎక్కువ లెవెల్​ ఉండేందుకు కారణమవుతోందని చెప్పారు. 2017–2019 మధ్య కాలంలో విరళ్​ ఆచార్య రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాకు డిప్యూటీ గవర్నర్​గా వ్యవహరించారు. ప్రస్తుతం న్యూయార్క్​ యూనివర్సిటీ స్టెర్న్​ స్కూల్​లో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. రేట్ల నిర్ణయంలో బిగ్​5 కార్పొరేషన్ల పాత్ర తగ్గేలా చేసేందుకు, వాటిని విడగొట్టాల్సిందేనని చెప్పారు. ఎమర్జింగ్​ మార్కెట్లపై బ్రూకింగ్స్​ ఇన్​స్టిట్యూట్​ ప్యానెల్​కు సబ్మిట్​ చేయడానికి విరళ్​ ఆచార్య ఒక పేపర్​ రాశారు. ఆ పేపర్​లోనే ఈ  అంశాలన్నింటినీ  కూలంకషంగా డిస్కస్​ చేశారు. హిస్టారికల్​గా చూస్తే, దేశంలోని చిన్న చిన్న కంపెనీలు పెద్ద కార్పొరేషన్ల ప్రొడక్టివిటీ గెయిన్లను అందుకోలేకపోయాయని విరళ్​ ఆచార్య అన్నారు. ఇన్​పుట్​ రేట్లు తగ్గినా కూడా ఆ ఫలాలను దేశంలోని కన్జూమర్లు అందుకోలేకపోతున్నారని వాపోయారు. మెటల్స్ తయారీ​, కోక్​, రిఫైన్డ్​ పెట్రోలియం ప్రొడక్టులతోపాటు, రిటెయిల్​ ట్రేడ్, టెలికం​ రంగాలనూ ఈ  బిగ్​5 కంపెనీలే కంట్రోల్​ చేస్తున్నాయన్నారు.

గ్లోబల్​గా వస్తువుల రేట్లు తగ్గాయ్​..

సప్లయ్ చెయిన్​ సమస్యలు తొలగిపోవడంతో గ్లోబల్​గా ఇతర దేశాలలో వస్తువుల రేట్లు కిందకి దిగి వచ్చాయని, కానీ ఇండియాలో మాత్రం అలా జరగడం లేదని విరళ్​ ఆచార్య వెల్లడించారు. కోర్​ ఇన్​ఫ్లేషన్​ హై లెవెల్లో ఉండటం వల్లే బారోయింగ్​ ఖర్చులు (వడ్డీ ) ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఇన్​ఫ్లేషన్​ వరసగా 17 నెలలపాటు 6 శాతం పైనే ఉంటోందని అన్నారు. పెద్ద కార్పొరేట్ల పవర్​ దేశంలో ఎంతగా పెరిగితే, ఇన్​ఫ్లేషన్​ రిస్కులు అంత ఎక్కువవుతాయని ఆచార్య చెప్పారు. ఆర్​బీఐకి స్వేచ్ఛ ఉండాలని చెబుతూ ఉంటారు. తన దగ్గర కూడా పూర్తి సొల్యూషన్స్​ ఏవీ లేవంటూనే, చైనా తర్వాత శక్తివంతమైన ఎకానమీగా ఇండియా రాబోయే 10 ఏళ్లలో ఎదగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.