ఈ మధ్య రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లింది. ఎక్కడడితే అక్కడ..ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఫేం కావడం కోసం..వ్యూస్ రావడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవల నోయిడాలోని ఓ మెట్రోలో హోలీ రోజున ఇద్దరమ్మాయిలు చేసిన రోమాన్స్ ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు యువకులు రోడ్డు మధ్యలో కారు ఆపి రీల్స్ చేయడం వివాదస్పదంగా మారింది.
అసలేం జరిగిందంటే.. ఇద్దరు యువకులు నార్త్ డిల్లీలోని పశ్చిమ విహార్ సమీపంలోని ఫ్లై ఓవర్ పై ఫుల్ ట్రాఫిక్ ఉన్న సమయంలో కారు ఆపి రీల్స్ చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు . ప్రదీప్ ఢాకా పోస్ట్ చేసిన వీడియోలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ . ట్రాఫిక్ కు అంతరాయం కల్గించినందకు..ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని..వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పాపులారిటీ కోసం చేసే ఇలాంటి వాళ్లకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష , వాహనాలను స్వాధీనం చేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.