
లక్నో: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే ఇండియా టీమ్లో ఉన్న లక్నో ప్లేయర్లు కేఎల్ రాహుల్, జైదేవ్ ఉనాద్కట్ గాయపడ్డారు. ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్లో బౌండ్రీ ఆపేందుకు స్పీడ్గా రన్నింగ్ చేస్తుండగా రాహుల్ కుడి తొడ కండరాలు పట్టేశాయి. దాంతో, గ్రౌండ్లో కుప్పకూలిన కేఎల్ నొప్పితో బాధపడ్డాడు. ఫిజియో, సపోర్ట్ స్టాఫ్ అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. కేఎల్ ప్లేస్లో క్రునాల్ పాండ్యా స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరించాడు. చివర్లో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో ఉనాద్కట్కు దెబ్బ తగిలింది. నెట్స్లో బౌలింగ్ చేస్తుండగా స్లిప్ అయిన జైదేవ్ కింద పడ్డాడు. అతని ఎడమ భుజానికి గాయమైంది.