ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జైలులో ఖైదీలు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లా జైలులో ఓ ఖైదీ చనిపోయాడు. అతను డెంగీతో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. అయితే ఖైదీ మృతితో మిగతా ఖైదీల్లో అలజడి ఏర్పడింది. పోలీసుల కారణంగానే ఖైదీ చనిపోయాడనే కోపంతో తోటి ఖైదీలు.. సెంట్రీలు, జైలు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. కొన్ని వస్తువులను తగలబెట్టారు. ఘర్షణల కారణంగా... 32 మంది ఖైదీలు, 30 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది. జైలులో ఘర్షణలతో భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని ఫరూఖాబాద్ జిల్లా అధికారులు తెలిపారు.
Visual taken from a height also indicates that some parts of the #Fatehgarh jail has been set on fire. Enormity of the damage not yet officially confirmed. #FatehgarhJail #Farrukhabad #UttarPradesh pic.twitter.com/YPUrjfd2oK
— Amar chouhan (@AMARONLY4INC) November 7, 2021