వడ్ల పైసల కోసం రైతుల వినూత్న నిరసన

వడ్ల పైసల కోసం రైతుల వినూత్న నిరసన

వడ్లు అమ్మి 2 నెలలు దాటినా తమ బ్యాంకు అకౌంట్​లో డబ్బులు జమ కాలేదని సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం అన్నారం రైతులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు.  అర్ధనగ్నంగా మెడలో వేపకొమ్మల దండలు వేసుకుని రైతులు తన్నీరు వెంకన్న, పూసపల్లి శ్రీనివాస్, సాగర్​రెడ్డి, వెంకట రామనర్సయ్య దీక్షకు కూర్చున్నారు. టైమ్​కు డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఎలాంటి కటింగులు లేకుండా డబ్బు వేయాలని కోరారు. – తుంగతుర్తి, వెలుగు