డ్రగ్స్ కేసులో ఆరా తీస్తున్న ఈడీ
విచారణకు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్
డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన మూడు బ్యాంక్ అకౌంట్లలో 2016 నుంచి 2017 జూన్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ను ఈడీ పరిశీలించింది. సినీ నటుడు నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్లోని పార్టీలు కేంద్రంగా ఈడీ దర్యాప్తు సాగిస్తోంది.
హైదరాబాద్,వెలుగు: డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన మూడు బ్యాంక్ అకౌంట్లలో 2016 నుంచి 2017 జూన్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ను ఈడీ పరిశీలించింది. వాటి ఆధారంగా రకుల్ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సినీ నటుడు నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్లోని పార్టీలు కేంద్రంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. క్లబ్ మేనేజర్ స్టేట్మెంట్ ఆధారంగా గత నెల రకుల్కు సమన్లు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం విచారణకు రావాల్సిన ఆమె.. శుక్రవారమే అటెండయ్యారు. ఎఫ్ క్లబ్లో కెల్విన్ పరిచయం దగ్గర్నుంచి 2016 నవంబర్లో జరిగిన పార్టీ వివరాలను ఈడీ రాబట్టింది. పార్టీలో రకుల్ కూడా పాల్గొన్నట్లు గుర్తించింది. ఆ రోజు కెల్విన్, నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్తో పాటు రకుల్ బ్యాంక్ అకౌంట్ల నుంచి అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. కెల్విన్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేసిన రూ. 30 లక్షల ట్రాన్సాక్షన్లలో రకుల్ అకౌంట్ వివరాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించింది.
ఆఫీసు ఓపెన్ చేయకముందే వచ్చి..!
శుక్రవారం ఉదయం 9.10 గంటలకే హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు రకుల్ ప్రీత్సింగ్ వచ్చారు. ఆఫీస్ ఓపెన్ చేయకపోవడంతో థర్డ్ఫ్లోర్లోని హాల్లో వెయిట్ చేశారు. రకుల్తో పాటు చార్టెడ్ అకౌంటెంట్, పర్సనల్ సెక్రటరీ కూడా వచ్చారు. ఉదయం10.30 గంటల తర్వాత తన చార్టెడ్ అకౌంటెంట్తో కలిసి ఈడీ అసిస్టెంట్డైరెక్టర్ ముందు హాజరయ్యారు. ముగ్గురు ఉమెన్ ఆఫీసర్లు, ఇద్దరు మెన్ ఆఫీసర్లతో కూడిన స్పెషల్ టీం రకుల్ను విచారించింది. లంచ్ టైంలో ఈడీ అందించిన ఫుడ్ కాకుండా ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్ని ఆమె తిన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు రకుల్ ప్రీత్ సింగ్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. షెడ్యూల్లో భాగంగా బుధవారం సినీ నటులు దగ్గుబాటి రానా, గురువారం రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ను విచారించనున్నారు.