
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలతో పాటు సింగరేణి సంస్థలో జరిగిన కుంభకోణాలపైనా జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లు ఒకే వ్యక్తి సీఎండీలో కొనసాగారని తెలిపారు.
ఈ క్రమంలో వేల కోట్లు మిస్ యూజ్ చేశారని, వెంటనే దీనిపై విచారణ చేయించాలని కోరారు. గురువారం ఆయన విద్యుత్ రంగంపై అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణికి ట్రాన్స్ కో నుంచి 17వేల కోట్లు, జెన్ కో నుంచి రూ.12వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సింగరేణి కార్మికులందరికీ ఇంటి జాగ కేటాయించాలని కోరారు.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ శాలరీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పరిధిలోని ఒక ఎకరానికి కరెంట్ ఖర్చు రూ.50వేలు అవుతుందని, మల్లన్నసాగర్ కు 70వేలు అవుతుందని చెప్పారు. భవిష్యత్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.