
న్యూఢిల్లీ: మన ఇండియన్ నేవీ మరింత బలోపేతం కానుంది. క్షిపణులను ప్రయోగించే యుద్ధనౌక ఐఎన్ఎస్ తమన్ ను వచ్చే నెల 1న నేవీలోకి చేర్చనున్నారు. ఐఎన్ఎస్ బ్రహ్మోస్ వంటి దీర్ఘశ్రేణి మిసైళ్లను ఈ యుద్ధనౌక క్యారీ చేస్తుంది. రష్యాలో ఈ వార్ షిప్ ను అభివృద్ధి చేశారు. ముందుగా రష్యాలోని కోస్టల్ సిటీ కలినింగ్రాడ్ లో జులై 1న ఈ నౌకను ప్రవేశపెడతారు. తర్వాత భారత్ లోని వెస్టర్న్ ఫ్లీట్ కు తరలిస్తారు. ఈ నౌకలో 26 శాతం పరికరాలను దేశీయంగా తయారు చేశారు. ఐఎన్ఎస్ తమన్ నుంచి సముద్రంలోనూ, నేలమీద శత్రువులపైకి మిసైళ్లను ప్రయోగించవచ్చు. దీని పొడవు 125 మీటర్లు, బరువు 3,900 టన్నులు. రష్యా, ఇండియాకు చెందిన ఆధునిక టెక్నాలజీని మేళవించి ఈ యుద్ధనౌకను డెవలప్ చేశారు.
దీని నిర్మాణంలో అత్యంత ఆధునిక పద్ధతులను వినియోగించారు. ఇది స్టెల్త్ నేవీ. అంటే శత్రు దేశ రాడార్లకు ఇది చిక్కదు. ఎనిమీ రాడార్లు గుర్తించేలోపే ఇది తప్పించుకుంటుంది. ఈ నౌక కమిషన్ తో నేవీ మరింత బలోపేతం అవుతుందని భారత నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ తెలిపారు. అలాగే, ఈ నౌక నిర్మాణంతో ఇండియా, రష్యా మధ్య సహకార భాగస్వామ్యం మరింత దృఢంగా మారిందని ఆయన చెప్పారు. గత రెండు దశాబ్దాల్లో భారత నేవీలో ఇప్పటి వరకూ రష్యా నుంచి ఏడు క్షిపణి యుద్ధనౌకలు చేరాయని, ఐఎన్ఎస్ తమల్ 8వది అని వెల్లడించారు. రష్యాలో కలినింగ్రాడ్ లోని యాంతార్ షిప్
యార్డులో దీనిని నిర్మించారని తెలిపారు.