ఇన్‌‌‌‌‌‌‌‌స్టాషీల్డ్‌‌‌‌‌‌‌‌కు అవార్డు

ఇన్‌‌‌‌‌‌‌‌స్టాషీల్డ్‌‌‌‌‌‌‌‌కు అవార్డు

హైదరాబాద్, వెలుగు :  నగరానికి మెడ్‌‌‌‌‌‌‌‌టెక్ వెల్‌‌‌‌‌‌‌‌నెస్ కంపెనీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాషీల్డ్ జెమ్స్ ఆఫ్ గుజరాత్ అవార్డ్స్, కాన్‌‌‌‌‌‌‌‌క్లేవ్ 2023లో బెస్ట్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అవార్డును అందుకుంది. ఈ రంగానికి విశేషమైన సహకారం అందించినందుకు గుర్తింపు పొందింది.  గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఒక వేడుకలో దీనిని సంస్థ ప్రతినిధులకు అందజేశారు. తాము తీసుకొచ్చిన టెక్నాలజీ ఇన్నోవేషన్ల కారణంగానే ఈ గౌరవం దక్కిందని ఇన్​స్టా షీల్డ్​ తెలిపింది.