పాపం.. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు.. ఒకేసారి 25 వేల ఉద్యోగులను తీసేస్తున్నరు !

పాపం.. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు.. ఒకేసారి 25 వేల ఉద్యోగులను తీసేస్తున్నరు !
  • ఇంటెల్లో 25 వేల ఉద్యోగాలకు కోత
  • నష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • ఖర్చులు తగ్గించుకునేందుకు లేఆఫ్లు తప్పవని ప్రకటన
  • ఈ ఏడాది సెకండ్ క్వార్టర్లో15 వేల మంది తొలగింపు

వాషింగ్టన్: చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ భారీగా ఉద్యోగాలకు కోత పెట్టనుంది. త్వరలో 25 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది చివరి లోపు ఉద్యోగుల సంఖ్యను 75 వేలకు తగ్గించేందుకు ప్లాన్  చేస్తున్నది. దశలవారీగా 25 వేల మందిని ఇంటికి పంపనుంది. ఇదివరకే ఈ ఏడాది ఏప్రిల్  నుంచి 15 వేల మంది ఉద్యోగులను సంస్థ తొలగించింది. అలాగే గత ఏడాది కూడా 15 వేల మందికిపైనే ఇంటికి పంపింది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇంటెల్  విడుదల చేసింది. త్వరలోనే 25 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

సెకండ్  క్వార్టర్లో కంపెనీకి రూ.లక్ష కోట్ల ఆదాయం రాగా.. రూ.25 వేల కోట్ల నష్టాలు వచ్చాయని పేర్కొంది. నష్టాలు, వ్యయాలు తగ్గించుకునేందుకు భారీగా కోతలు పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని తెలిపింది.  జర్మనీ, పోలండ్​లో కొత్త ఫ్యాక్టరీలు నిర్మించాలన్న ఆలోచనను కూడా కంపెనీ విరమించుకుంది. ఆ కంపెనీలను వియత్నాం లేదా మలేషియాకు మార్చాలనుకుంటున్నది. ఒకప్పుడు చిప్  మార్కెట్ లో లీడర్ గా వెలుగు వెలిగిన ఇంటెల్.. గత కొన్నేండ్లుగా ఒడిదొడుకులతో సతమతం అవుతోంది.  మైక్రోసాఫ్ట్  కూడా ఇటీవలే 15 వేల మంది ఉద్యోగులను తొలగించింది.