ఇంటర్ లో ఫెయిలయ్యానని మరో స్టూడెంట్ ఆత్మహత్య

ఇంటర్ లో ఫెయిలయ్యానని మరో స్టూడెంట్ ఆత్మహత్య

వారం రోజుల కిందట విడుదలైన ఇంటర్ ఫలితాలలో చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు విద్యార్థులను కనీసం పాస్ మార్కులతోనైనా పాస్ చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని నందిని ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి పరిస్థితి విషమించడంతో హైదారాబాద్ గాంధీ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ నందిని ఈ రోజు చనిపోయింది. ఇంటర్ లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై నందిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.

For More News..

మేం అడుక్కోవడానికి వచ్చామా? మా పేదల కోసం సర్కారు ఏం చేస్తోంది?

అవసరమైతే నైట్​ కర్ఫ్యూ పెట్టండి

పిల్లల మొహం చూసి వదిలేయమన్నా కనికరించని మావోలు