- మృతుడి తల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్
పెద్దపల్లి, వెలుగు: ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్పర్సన్ఈర్ల స్వరూప, సురేందర్ దంపతుల కొడుకు విశ్వతేజ(17) మంగళవారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. బుధవారం పెద్దపల్లి టౌన్ పరిధి బంధంపల్లిలోని వ్యవసాయ బావిలో డెడ్ బాడీ ఉందనే సమాచారంతో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు వెళ్లారు. బావిలోంచి డెడ్ బాడీని బయటకు తీసి విశ్వతేజగా గుర్తించారు. అతని పేరెంట్స్ కు తెలపగా వచ్చి బోరున విలపించారు. కరీంనగర్లోని ప్రైవేటు కాలేజీలో విశ్వతేజ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడు హాస్టల్కు వెళ్లనని పేరెంట్స్ తో చెప్పగా వారు ఒప్పుకోకపోవడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్కుమార్, మల్లేశ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
