హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ , మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యుస్ పరీక్ష జూలై 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఇక ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ను జూలై 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 10 గంటల వరకు నిర్వహించనున్నారు. గురువారం నుంచి జులై 6వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీయెట్ బోర్డు ప్రకటించింది.