టీ20లో రోహిత్ రికార్డ్..ఇండియా తరపున ఒకే ఒక్కడు

టీ20లో రోహిత్ రికార్డ్..ఇండియా తరపున ఒకే ఒక్కడు

టీమిండియా సిక్సుల వీరుడు రోహిత్ శర్మ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ-20 క్రికెట్ లో ఏ ఇతర ఇండియన్ బ్యాటర్ కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 400వ సిక్సర్ కొట్టాడు. ఇప్పటి వరకూ ఇండియా తరఫున రోహిత్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అతని తర్వాత ఏ బ్యాటర్ కూడా 350 సిక్సర్లు దాటలేదు. 325 సిక్సర్లతో CSK బ్యాటర్ సురేశ్ రైనా సెకండ్ ప్లేస్ లో ఉండగా.. RCB కెప్టెన్ విరాట్ కోహ్లి 320 సిక్స ర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ 304 సిక్స్ లు కొట్టాడు.

ఇక రోహిత్ బాదిన మొత్తం 400 సిక్సర్లలో 133 ఇండియన్ టీమ్ తరఫున కాగా.. 227 ఐపీఎల్ లో కొట్టాడు. మరో 24 చాంపియన్స్ లీగ్ టీ-20లో కొట్టాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్స్ ల రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. 1042 సిక్సర్లతో అతడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో 1000 సిక్సర్లు దాటిన ఏకైక ప్లేయర్ కూడా క్రిస్ గేలే.