ఐపీఎల్ ను రద్దు చేయండి.. బీసీసీఐకి ఫ్యాన్స్ విజ్ఞప్తి

ఐపీఎల్ ను రద్దు చేయండి.. బీసీసీఐకి ఫ్యాన్స్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఎఫెక్ట్ క్రికెట్ మీద పడేలా కనిపిస్తోంది. ధనాధన్ లీగ్ ఐపీఎల్ పద్నాలుగో సీజన్ ను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని బీసీసీఐని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇప్పటికే లీగ్ లో ఆడాల్సిన అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్ కరోనా పాజిటివ్ గా తేలారు. ఈ నేపథ్యంలో లీగ్ జరగడం పై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఐపీఎల్ మీద చర్చ జరుగుతోంది. లీగ్ జరిగేది అనుమానమేనని కొందరు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు టోర్నీ యూఏఈలో జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.