IPL 2024 Auction: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ వేలం.. తప్పుకున్న ఇంగ్లాండ్, బంగ్లా క్రికెటర్లు

IPL 2024 Auction: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ వేలం.. తప్పుకున్న ఇంగ్లాండ్, బంగ్లా క్రికెటర్లు

మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా ఐపీఎల్‌ 2024 మినీ వేలం తెరలేవనున్న విషయం తెలిసిందే. ఈ వేలం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

ఐపీఎల్ వేలం నుంచి ఇంగ్లీష్ యువ స్పిన్నర్‌ రిహాన్‌ అహ్మద్‌ తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ కమిట్‌మెంట్స్‌తో పాటు వ్యక్తిగత కారణాల రీత్యా రిహాన్‌.. వేలం నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అతనితో పాటు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు టస్కిన్‌ అహ్మద్‌, షోరిఫుల్‌ ఇస్లాం వేలం నుంచి తమ పేర్లను ఉపసంహరించుకున్నారు.

19 ఏళ్ల రెహాన్ అహ్మద్ 45 టీ20 మ్యాచ్‌ల్లో 7.82 ఎకానమీ రేటుతో 46 వికెట్లు తీశాడు. ఇక  పేసర్లైన టస్కిన్‌ అహ్మద్‌, షోరిఫుల్‌ ఇస్లాం బంగ్లా వైట్-బాల్ క్రికెట్‌లో రెగ్యులర్‌ ఆటగాళ్లుగా ఉన్నారు. లెఫ్టార్మ్ పేసరైన షోరిఫుల్‌ 85 టీ20 మ్యాచుల్లో 97 వికెట్లు పడగొట్టగా.. రైటార్మ్ పేసరైన టాస్కిన్ 137 టీ20 మ్యాచ్‌ల్లో 158 వికెట్లు తీశాడు.