హైదరాబాద్: IPL సీజన్ -12లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది హైదరాబాద్. కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన సన్ రైజర్స్ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. సొంతగడ్డపై జరిగే నాలుగో మ్యాచ్ లో సత్తా చాటాలని ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. హైదరాబాద్ టీమ్ చాలా మార్పులు చేసింది. మనీశ్ పాండే, సిద్ధార్థ్ కౌల్, యూసుఫ్ పఠాన్ స్థానంలో కేన్ విలియమ్సన్, రికీ భుయ్, అభిషేక్ శర్మ, ఖలీల్ అహ్మద్ టీమ్ లోకి వచ్చారు. వరుసగా 2 విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ హ్యాట్రిక్ పై కన్నేసింది.
టీమ్స్ వివరాలు..
A look at the Playing XI for #SRHvDC
Live – https://t.co/8DHQY1AmZW pic.twitter.com/Rf40qAlrWE
— IndianPremierLeague (@IPL) April 14, 2019