
టెహ్రాన్: ఇజ్రాయెల్ గూఢచారులు గా పని చేస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ ముగ్గురిని ఉరి తీసింది. ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మరో 700 మందిని అరెస్టు చేసింది. వీళ్లంతా మొస్సాద్ కోసం పని చేస్తున్నారని చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ మీడియా బుధవారం పేర్కొంది. అయితే ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన మరుసటి రోజే.. ఇరాన్ ఉరిశిక్షలు అమలు చేయడం, అరెస్టులు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా మధ్యవర్తిత్వంతో 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే దాన్ని ఉల్లంఘించాయి.