
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు..మిడిల్ ఈస్ట్ మూడో ప్రపంచ యుద్ద మేఘాలు..ఈ క్రమంలో గురువారం (జూన్ 19) రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోస్ సంభాషణ హాట్ టాపిక్ అయింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ సైనిక చర్య, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా రెండు దేశాలు ఏకాభిప్రాయం, దౌత్య మార్గాల ద్వారా మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలపై దాదాపు గంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మద్య చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ,రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గురువారం (జూన్19) ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలపై ట్రంప్, పుతిన్ చర్చించారు.
ఇరువురు నేతలు ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండించారు. ఇజ్రాయెల్ చర్యలు ఐక్యరాజ్యసమితి ఛార్టర్, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. ఇరాన్ అణు కార్యక్రమం సహా ప్రస్తుత సమస్యలకు సైనిక పరిష్కారాలు లేవని, రాజకీయ ,దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉందంటున్నారు ఇరువురు నేతలు.
క్రెమ్లిన్ విదేశాంగ విధాన సహాయకుడు యూరి ఉషాకోవ్ ప్రకారం.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య మధ్యవర్తిత్వానికి పుతిన్, జిన్ పింగ్ పుతిన్ సిద్దంగా ఉన్నారు. జిన్ పింగ్ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఇది ప్రస్తుత ఉద్రిక్తతను తగ్గించడంలో సాయపడొచ్చు.
పుతిన్,జి జిన్పింగ్ ఇరాన్కు సంబంధించిన సమాచారం పరస్పరం షేర్ చేసుకోవడానికి అంగీకరించారు. ఇజ్రాయెల్ ఇటీవలి సైనిక చర్యలను రష్యా ,చైనా ఖండించడంతో ఈ వివాదంపై ఇద్దరు నేతలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్,అంతర్జాతీయ చట్టపరమైన నిబంధనల ఇజ్రాయెల్ ఉల్లంఘించినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా విమర్శించారు.
ఇరాన్ ,ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా పౌరుల ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. తక్షణ కాల్పుల విరమణ అవసరం.. విదేశీ పౌరుల తరలింపుకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు జిన్ పింగ్.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్దం, మిడిల్ ఈస్ట్ లో జరిగే పరిమాణాలపై సమావేశం కావాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంరబ్ 3 వరకు చైనాలో షాంఘై సమకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రత్యక్షంగా భేటీ కానున్నారు.