టెల్ అవీవ్లో విధ్వంసం .. మిసైళ్లతో విరుచుకుపడిన టెహ్రాన్

టెల్ అవీవ్లో విధ్వంసం .. మిసైళ్లతో విరుచుకుపడిన టెహ్రాన్

టెహ్రాన్ (ఇరాన్): అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్​తో కలిసి ఇరాన్​లోని ఫోర్డో, నతాంజ్‌‌‌‌, ఇస్ఫాహన్ న్యూక్లియర్ ప్లాంట్లను ట్రంప్ ధ్వంసం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్​పై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడింది. రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. అటు అమెరికాకూ ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.  

పశ్చిమాసియాలోని యూఎస్ పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే దాడులు ఉంటాయని ఇరాన్‌‌‌‌ అధికారిక మీడియా అగ్ర రాజ్యానికి వార్నింగ్ ఇచ్చింది. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ప్రారంభించారని.. తాము పూర్తి చేస్తాం’’అని ఇరాన్‌‌‌‌ హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికలపై అటు అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికన్లు, సైనిక స్థావరాలపై దాడి చేస్తే.. ఎన్నడూ చూడని విధంగా దాడులతో విరుచుకుపడతామని హెచ్చరించింది. 

టెల్​అవీవ్ వీధులు ధ్వంసం

ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వీధులన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్​పై దాడి కోసం ఇరాన్ తన ఖోర్రంషహర్ 4 అనే బాలిస్టిక్ మిసైల్స్ వాడింది. 2వేల కిలో మీటర్ల రేంజ్ ఉన్న ఈ మిసైల్ వార్ హెడ్ బరువు 1,500 కిలోల వరకు ఉంటుంది. ఇరాన్ దాడులతో టెల్​అవీవ్​లోని ఓ భవనం పూర్తిగా ధ్వంసమైంది. బెన్ గురియన్ విమానాశ్రయం పాక్షికంగా దెబ్బతిన్నది. 

ఇరాన్ దాడులతో ప్రభావితమైన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ అత్యవసర బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇజ్రాయెల్‌‌‌‌లోని జెరూసలెంలోనూ భారీ పేలుడు సంభవించింది. కాగా, ఇటు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు యాక్టివ్ అయ్యారు. ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్​పై 50కు పైగా ఖోర్రంషహర్ 4 మిసైళ్లను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ జరిపిన దాడుల్లో 11 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ ప్రకటించింది.

ఇజ్రాయెల్​లో ఎమర్జెన్సీ

ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌‌‌‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. దాడుల సందర్భంగా టెల్ అవీవ్‌‌‌‌ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. దాదాపు 400 ప్రాంతాల్లో సైరెన్లు మోగినట్టు తెలుస్తున్నది. దీంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇరాన్‌‌‌‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులకు అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పౌరులందరూ షెల్టర్‌‌‌‌ హోమ్స్‌‌‌‌లోనే ఉండాలని.. హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను పాటించాలని సూ చించింది. క్షిపణి దాడుల కారణంగా అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది. ఇజ్రాయెల్‌‌‌‌ తన ఎయిర్ స్పేస్​ను క్లోజ్ చేసింది. అయితే, ఈజిప్ట్, జోర్డాన్‌‌‌‌తో భూ సరిహద్దు క్రాసింగ్‌‌‌‌లు తదుపరి నోటీసు వచ్చే వరకు తెరిచే ఉంటాయంది.

‘ఖోర్రంషహర్ 4’ మిసైల్

ఖోర్రంషహర్4 క్షిపణి.. నాల్గోతరం మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ‘ఖైబర్’ అని కూడా పిలుస్తారు. ఇరాన్​కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ దీన్ని తయారు చేసింది. ఇది సుమారు 13 మీటర్లు (వార్‌‌‌‌హెడ్‌‌‌‌తో కలిపి 17 మీటర్ల వరకు) పొడవు ఉంటుంది. వెడల్పు 1.5 మీటర్లు. సుమారు 20 నుంచి 30 టన్నుల బరువు ఉంటుంది. వార్ హెడ్​తో కలిపి 1,500 నుంచి 2,000 కిలోల వరకు ఉంటుంది. అధికారికంగా 2వేల కిలో మీటర్ల రేంజ్ ఉంది. వార్ హెడ్ బరువు తక్కువుంటే..4వేల కిలో మీటర్ల దూరం ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది. హైపర్‌‌‌‌గోలిక్ లిక్విడ్ ఇంధనం వాడుతారు. అందుకే
ఈ మిసైల్  12 నిమిషాల్లోనే లాంచింగ్​కు సిద్ధం అవుతుంది.