
టెహ్రాన్: ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్.. పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా అమెరికాను హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా పెద్ద నేరం చేసిందని మండిపడింది. ఇకపై అమెరికన్లకు పశ్చిమాసియాలో స్థానం లేదని తేల్చి చెప్పింది.
పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొన్నది. వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన 2 రోజుల్లోనే ట్రంప్ దాడులు చేశారని మండిపడింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి కుట్ర పన్నాయని ఫైర్ అయింది.