సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు... టూర్ ప్యాకేజీ వివరాలివే

సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు... టూర్ ప్యాకేజీ వివరాలివే

ఐఆర్సీటీసీ తెలుగు రాష్ట్రాల్లోని పలు  రూట్స్ లో భారత్ గౌరవ్ టూరిస్టు  రైళ్లను నడపుతూ పాపులర్ అయ్యింది. వీటిలో పుణ్యక్షేత్ర యాత్ర బాగా పాపులర్ అయ్యింది. గతేడాది  కాశీ గయ విచిత్ర పిండ దాన్ యాత్ర సక్సెస్ కావడంతో లేటెస్ట్ గా మరో యాత్రకు శ్రీకారం చుట్టింది. జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్రకు  భరత్ గౌరవ్ ప్లాన్ చేసింది.

ఈ యాత్ర  జనవరి 23 నుంచి తొమ్మిది రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోని టూరిస్ట్ స్పాట్ లను కవర్ చేస్తుంది.  తిరువణ్ణామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రయాణీకులు, యాత్రికులకు టూర్ అవకాశం కల్పిస్తోంది. 

ఈ యాత్రకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు,  రేణిగుంటలలో బోర్డింగ్ , డి-బోర్డింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.  ప్రయాణికులకు వసతి,  సౌకర్యాలు, క్యాటరింగ్, భోజనం వంటి ఎలాంటి సమస్యలు ఉండవు.  భద్రతా చర్యలు, ప్రయాణ భీమా వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. 

 టూరిస్టులకు జీఎస్టీతో సహా ఎకానమీ కేటగిరీ (ఎస్‌ఎల్) ఒక్కొక్కరికి రూ.14,100 , స్టాండర్డ్ కేటగిరీ (3ఎసి)కి రూ. 21,500, కంఫర్ట్ కేటగిరీ (2AC) కోసం రూ. 27,900గా ఉంది. ఎవరైనా ఈ యాత్ర వెళ్లాలనుకునే వాళ్లు IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 9701360701ను సంప్రదించడం ద్వారా కౌంటర్ బుకింగ్‌లను సంప్రదించవచ్చు.