హైదరాబాద్, వెలుగు : ఎన్ఆర్ఐలు కాంగ్రెస్ లో చేరాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇండియన్– అమెరికన్ ఫోరం(ఐఏఎఫ్) కాంగ్రెస్ పార్టీకి, సెక్యులరిజానికి ఎంతో సేవ చేస్తున్నదని ప్రశంసించారు. ఎన్ఐఆర్లు రాజకీయాల్లోకి రావడం అభినందనీయ మని చెప్పారు. విదేశాల్లో సెటిలై సొంత ప్రాంతానికి, ప్రజలకు సేవ చేయాలని ఎన్ఐఆర్లు వస్తున్నారని తెలిపారు. సెక్యులరిజాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కించపరిస్తూ కామెంట్లు చేయడం బాధాకరమన్నారు. 40 ఏండ్లకు పైగా విదేశాల్లో ఉండి..
పుట్టిన నేలకు సేవ చేయడానికి తిరిగి వచ్చానని హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి (పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అత్త) అన్నారు. ఎన్ఆర్ఐలు ఇండియాకు వచ్చి సేవ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వారికి కాంగ్రెస్ నుంచి సపోర్ట్ ఉంటుందని తెలిపారు. మన దేశం ఎలా ఉందో తెలుసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలని ఎన్ఆర్ఐలను కోరారు.