మేడిపల్లి, వెలుగు: ఫీజు బకాయిలు ఇవ్వమని అడిగినందుకు విద్యాసంస్థల యాజమాన్యాలపై ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేయించడం తగదని ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎండీ.అన్వర్ అన్నారు.
ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు నవంబర్ 3 నుండి నిరవధిక బంద్ చేస్తామని ప్రకటిస్తే, ప్రభుత్వం ఫీజు బకాయిల నిధులు దుర్వినియోగంపై విజిలెన్స్ దాడులకు దిగడం బ్లాక్మెయిల్ చేయడమేనన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేశాక తనిఖీలు నిర్వహించాలని కోరారు. హరీశ్, అరవింద్, సందీప్, వికారం, సాయి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
కూకట్పల్లి: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సో మవారం జేఎన్టీయూలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. అనంతరం వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు అంబటి విశ్వజ్ఞతేజ, ఎరవెల్లి జగన్, భానుప్రకాశ్నాయక్ మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ ఆలస్యం చేయడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు.
