
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తో ట్రెండ్ సెట్ చేశాడు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. టాలీవుడ్ లో హిట్ పడగానే బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ కూడా కబీర్ సింగ్, యానిమాల్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఫిధా చేశాడు. దీంతో ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే మ్యూజిక్ పనులు ప్రారంభించిన సందీప్ రెడ్డి ప్రస్తుతం స్పిరిట్ లో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.
అయితే స్పిరిట్ లో ప్రభాస్ కి జోడీగా ప్రముఖ హీరోయిన్లు కియారా అద్వానీ, నేషనల్ క్రష్ రష్మిక మందాన పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో కియరా అద్వాని కి స్టార్ ఇమేజ్ ఉండటంతోపాటూ టాలీవుడ్, బాలీవుడ్ లలో మంచి క్రేజ్ ఉంది. దీనికితోడు గతంలో సందీప్ రెడ్డితో పనిచేసిన కబీర్ సింగ్ సినిమా పెద్ద హిట్ అయ్యింది.
Also Read : పుష్ప 2 సెట్స్ నుంచి స్పెషల్ సాంగ్ పిక్స్ లీక్..
ఇక రష్మిక మందాన కూడా సందీప్ రెడ్డి తీసిన యానిమాల్ సినిమాతో ఆకట్టుకుంది. దీంతో ఈ ఇద్దరిలో ఒకరిని ప్రభాస్ స్పిరిట్ కి కూడా కంటిన్యూ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే యానిమల్ సినిమాతో రూ.1000 కోట్లు (గ్రాస్) మార్క్ ని సందేప రెడ్డి అందుకున్నాడు. దీంతో ఈసారి ప్రభాస్ స్పిరిట్ తో పెద్దమొత్తంలోనే బాక్సాఫీస్ టార్గెట్ ని సెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్నాడు. సలార్ 2, కల్కి 2, ది రాజా సాబ్ తదితర చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో మరో మూడు సినిమాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.