కింగ్ నే ఇమిటేట్ చేస్తావా.. అందరి ముందు ఇషాన్ కిషన్ పరువు తీసిన కోహ్లీ

కింగ్ నే ఇమిటేట్ చేస్తావా.. అందరి ముందు ఇషాన్ కిషన్ పరువు తీసిన కోహ్లీ

టీమిండియా పాకెట్ డైనమో ఇషాన్ కిషాన్ ఖాళీ దొరికితే చాలు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాడు.ఎప్పుడూ సరదాగా ఉండే కిషాన్.. వీలు చిక్కినప్పుడల్లా తోటి ప్లేయర్లను ఇమిటేట్ చేస్తూ..నవ్వులు పూయిస్తూ ఉంటాడు. కిషాన్ చేసే చిలిపి పనులకు ఎవరైనా పరువు పోగొట్టుకోవాల్సిందే. అయితే ఇదంతా అందరి దగ్గర ఓకే. కానీ కింగ్ కోహ్లీ దగ్గర ఇలాంటి పప్పులు ఉడకవు. తాజాగా కోహ్లీని ఇమిటేట్ చేసిన కిషాన్ విరాట్ ఇచ్చిన రియాక్షన్ కి బలైపోయాడు.
 
 ఆసియా కప్ ఫైనల్ రెండు గంటల్లో ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీలంకను 50 పరుగులకే చిత్తు చేసిన భారత్.. స్వల్ప లక్ష్యాన్ని 6 ఓవర్లలోనే ఛేజ్ చేశారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఇషాన్ కిషాన్.. కోహ్లీ ఎలా నడుస్తాడో చేసి చూపించాడు. అచ్చం విరాట్ లా నడుస్తూ నవ్వు తెప్పించాడు. అయితే కోహ్లీ ఊరుకుంటాడా.. తగ్గేదేలే అన్నట్లుగా కిషాన్ ఎలా నడుస్తాడో చేసి చూపించాడు. ఇది చూసి స్టేడియంలో ఉన్నవారందరూ నవ్వుకున్నారు. 

ALSO READ: వీడియో:అయ్యో రోహిత్..ఇంత మతి మరుపా..? మరీ చిన్న పిల్లాడిలా 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కోహ్లీ అభిమానులు ఈ వీడియో చూస్తూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. మొత్తానికి ఆటలోనే కాదు ఎందులోనూ విరాట్ ని గెలవలేరు అనే విషయాన్ని మరోసారి నిరూపించాడు. ప్రస్తుతం భారత క్రికెటర్లందరూ స్వదేశానికి చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.