
డెయిర్ అల్-బలా: సెంట్రల్ గాజాపై ఇజ్రాయెలీ దళాలు డ్రోన్లతో దాడులు చేయడంతో 25 మంది చనిపోయారు. ఆహారాన్ని పంపిణీ చేసే ట్రక్కుల వైపు మంగళవారం వందలాది మంది ప్రజలు వస్తుండగా ఈ ఘటన జరిగిందని పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో గత నెలలో ఆహార పంపిణీ కేంద్రాలు ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో హింస నెలకొంది. ఆహారం కోసం వస్తున్న వారి పైకి ఇజ్రాయెల్ దళాలు తరచుగా కాల్పులు జరుపుతున్నాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు. కాగా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ తో ఇజ్రాయెల్ జరిపిన యుద్ధంలో గాజాలో ఇప్పటి వరకు 56వేల మందికిపైగా మరణించారని పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.