
- అమెరికా నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్న నెతన్యాహు
టెల్ అవీవ్: ఇరాన్లోని అణుకేంద్రాలను నాశనం చేస్తానని మాట ఇచ్చానని, అది నిలబెట్టుకున్నానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ సహకారంతో అమెరికా ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. ఇరాన్లోని అణుకేంద్రాలపై దాడి చేయాలని అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. దీనివల్ల పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అభినందనలు తెలియజేశారు. ఇరాన్లోని అణుకేం ద్రాలపై అమెరికా దాడి తర్వాత నెతన్యాహు సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ విడుదల చేశారు. ‘‘ఇరాన్లోని అణుకేంద్రాలను నాశనం చేస్తానని ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలైనప్పటి నుంచీ చెబుతున్నాను.
ఇప్పుడది నెరవేరింది. దీనికి నేను, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కా ప్రణాళిక వేశాం. దాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ సహకారంతో అమెరికా పక్కాగా అమలు చేసింది. ఆపరేషన్ విజయ వంతమైనందుకు ట్రం ప్కు అభినందనలు. ఆయన తీసుకున్న ఈ సాహసో పేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. పశ్చిమాసియాలో శాంతి, అభివృద్ధికి దోహదపడుతుం ది. ఇందుకు ట్రంప్కు కృతజ్ఞతలు. బలమైన శక్తి ద్వారానే శాంతి నెలకొంటుందని ట్రంప్, నేను చెప్తుంటాం. ముందు శక్తిని ప్రయోగిస్తే.. ఆ తర్వాత శాంతి అదే వస్తుంది” అని నెతన్యాహు పేర్కొన్నారు.