
- గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన వర్సిటీ
జేఎన్టీయూ(హైదరాబాద్), వెలుగు : తాను జీవితంలో ఎన్నో పరాజయాలు చూశానని, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నానని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ప్రారంభంలో రాకెట్ రూపకల్పనలోనూ చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, వాటన్నింటినీ అధిగమించి మూడు సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేశామని చెప్పారు. శుక్రవారం జేఎన్టీయూహెచ్ 12వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
కార్యక్రమంలో సోమనాథ్కు జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్కట్టా నర్సింహారెడ్డి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ.. గోల్డ్మెడల్స్, పీహెచ్డీ, డిగ్రీ పట్టాలు తీసుకునే ఈ రోజు ప్రతి స్టూడెంట్కు మరుపురానిదన్నారు. ప్రతి స్టూడెంట్ఈ స్థానంలో ఉండడం వెనుక వారి పేరెంట్స్, టీచర్స్ కృషి ఉంటుందన్నారు. దేశంలో నిపుణులైన ఇంజినీర్లను తయారు చేయడంలో ప్రొఫెసర్ల కృషి ఉందన్నారు.
టెక్నాలజీలో ఈ దేశాన్ని ముందు వరుసలో నిలుపుతున్న సంస్థల్లో ఇస్రో కూడా ఒకటన్నారు. తక్కువ ఖర్చుతో మంచి ప్రాజెక్టులు చేసేందుకు ఇస్రో కృషి చేస్తున్నదని చెప్పారు. చంద్రయాన్ –3 విజయం దేశం గర్వించేలా చేసిందన్నారు. స్పేస్ రంగంలో మరిన్ని స్టార్టప్లు, ఇండస్ట్రీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం యూనివర్సిటీలో టాపర్స్గా నిలిచిన 54 మందికి గోల్డ్ మెడల్స్ అందజేశారు.
142 మందికి పీహెచ్డీ పట్టాలు ఇచ్చారు. ఈ కాన్వొకేషన్కు హాజరుకాలేకపోయిన గవర్నర్, వర్సిటీ చాన్స్లర్ తమిళిసై స్టూడెంట్స్కు సందేశాన్ని పంపారు. విద్యార్థులు దేశం గర్వించేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ మజూర్ హుస్సేన్, రెక్టార్ గోవర్ధన్, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, వారి పేరెంట్స్ పాల్గొన్నారు.