ఈ నెల 14న ఉదయం 5గంటల 59 నిమిషాలకు శ్రీహరికోట షార్ నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లనుంది. PSLV-C 52 ను ప్రయోగించనున్నారు. ఇందులో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇవాళ(శనివారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. PSLV-C 52 ప్రయోగం విజయవంతం కావాలంటూ, రాకెట్ నమూనాను మూలవిరాట్టు పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయోగం విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత ఆలయ అధికారులు..శాస్త్రవేత్తలకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.