మూడోసారీ పుష్పక్ పాస్.. క్షేమంగా ల్యాండైన ఆర్ఎల్​వీ

మూడోసారీ పుష్పక్ పాస్.. క్షేమంగా ల్యాండైన ఆర్ఎల్​వీ

రీయూజబుల్ లాంచ్​ వెహికల్ పుష్పక్.. మూడోసారీ విజయవంతంగా ల్యాండయింది. 4 కి.మీ.ల దూరం, 4.5 కి.మీ.ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలేయగా రన్ వేను వెతుక్కుంటూ, దారి సరి చేసుకుంటూ వచ్చి నిర్ధారించిన ప్లేస్​లో దిగింది.

న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారీ పుష్పక్​విజయవంతంగా ల్యాండయింది. ఆదివారం ఉదయం కర్నాటకలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏఎన్​టీ) లో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ ఫుల్​గా పూర్తయిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్​నాథ్ చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగించేందుకు దేశీయంగా తయారు చేసిన రీయూజబుల్ లాంఛ్ వెహికల్​(ఆర్ఎల్​వీ) పేరే పుష్పక్.. దీనిపై ఇప్పటికే రెండుమార్లు ల్యాండింగ్ టెస్టులు విజయవంతంగా పూర్తిచేశామని, చివరి టెస్టులోనూ పుష్పక్​ పాస్ అయిందన్నారు. తర్వాతి స్టేజ్​లో పుష్పక్​తో ఆర్బిటల్​ టెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. 

ఆదివారం పరీక్షలో భాగంగా పుష్పక్​ను చినూక్ హెలీకాఫ్టర్ ద్వారా ఏఎన్​టీకి నాలుగు కిలోమీటర్ల దూరం, 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలేసినట్లు సోమ్​ నాథ్​ తెలిపారు. దిగాల్సిన ప్రదేశంలో రన్ వేను వెతుక్కుంటూ, దారి సరి చేసుకుంటూ పుష్పక్​  నేల వైపు దూసుకొచ్చిందని వివరించారు. ల్యాండింగ్ సమయంలో పుష్పక్ వేగం గంటకు 320 కిలోమీటర్లుగా నమోదైందన్నారు. అయితే, పారాచూట్ బ్రేకింగ్​ వ్యవస్థ సాయంతో పుష్పక్ రన్ వే పై ఆగిందని పేర్కొన్నారు. తాజా పరీక్షతో ప్రతికూల వాతావరణంలోనూ సేఫ్ గా దిగే సామర్థ్యం తనకుందని పుష్పక్ ఈ పరీక్షలో నిరూపించుకుందని వివరించారు.