టాలీవుడ్​లో మరి నెక్ట్స్​ ఏంటి?

టాలీవుడ్​లో మరి నెక్ట్స్​ ఏంటి?

నిఖిల్​ ‘స్పై’ సినిమాతో ఐశ్వర్య మీనన్​ టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చింది. ఈ నాజూకు అందం సినీ పరిశ్రమకు పరిచయమై పదేళ్లు దాటిందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. కోలీవుడ్​లో ఇన్నేళ్లుగా హీరోయిన్​ గా ఉన్న ఐశ్వర్య కేవలం పది సినిమాల్లోనే నటించింది. అవి కూడా ఆమెకు గుర్తింపునివ్వలేదు. దీంతో తన ఆశలన్నీ స్పై సినిమాపైనే పెట్టుకుంది. ఇవాళ ఈ సినిమా విడుదలై మిక్స్​డ్​ టాక్​ను సొంతం చేసుకుంది. 

ఇక ఈ బ్యూటీ గ్లామర్​, నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. దీంతో టాలీవుడ్​లో ఐశ్వర్య నెక్ట్స్​ ప్రాజెక్ట్​ ఏమిటా అనే విషయం ఆసక్తిగా మారింది. ఇతర పరిశ్రమల్లో నుంచి ఎంతో మంది ఇక్కడ లక్​ ను పరీక్షించుకుంటారు. కానీ, కొందరు మాత్రమే సక్సెస్​ అందుకుంటారు. మరి ఐశ్వర్య ఏ కోవలోకి చెందుతుందో తెలియాంటే మరికొన్ని రోజులు వెయిట్​ చేయాల్సిందే.