హైదరాబాద్, వెలుగు : కరోనా ఎఫెక్ట్తో ఐటీ ఇండస్ట్రీకి షాక్ తగలగా, ఖర్చులు తగ్గించుకుని నష్టాలు పూడ్చుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. థర్డ్ ఫేజ్లో 33 శాతం ఉద్యోగులతో ఆఫీసులు రన్ చేసేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. 60శాతం కంపెనీలు ఎంప్లాయీస్తో వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేయిస్తున్నాయి. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసినా కొంతకాలం ఇదే పద్ధతి కొనసాగే అవకాశముందని ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
అలా ఎందుకంటే…
గ్రేటర్ హైదరాబాద్లో స్మాల్, మీడియం, మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలు10 వేలకి పైనే ఉంటాయి. వాటిల్లో 6 లక్షల మంది టెకీలు వర్క్ చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి తక్కువ హ్యుమన్ రిసోర్స్తో ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఐటీ కంపెనీలు రన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయినా, అదనపు ఖర్చుగా భావిస్తున్న కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలోనే నడుస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఎంప్లాయీస్కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, ఫుడ్, క్యాంటీన్ ఫెసిలిటీస్ కల్పిస్తాయి. రిఫ్రెష్ మెంట్ యాక్టివిటీలో భాగంగా వీకెండ్ పార్టీలు, మంత్లీ టూర్లు కండక్ట్ చేస్తుంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్తో ఆఫీస్ మెయింటెనెన్స్ తోపాటు ఇప్పుడు ఆ అదనపు ఖర్చులన్నీ తగ్గిపోయాయని గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు.
ప్రొడక్షన్కి నో ప్రాబ్లమ్
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ప్రొడక్షన్లో మార్పు లేదని ఓ ఐటీ కంపెనీ టీమ్ లీడర్ అభిలాష్ తెలిపారు. తన టీమ్లో 25 మందికి ఆన్ లైన్ వీడియో కాలింగ్ ద్వారాసజెషన్స్ ఇస్తూ వర్క్ చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వర్ అడ్మినిస్ట్రేషన్, క్లయింట్ బేస్డ్ సర్వర్ ప్లాట్ఫామ్పై పనిచేసే సిబ్బందికి కూడా కంపెనీలు డెస్క్ టాప్లు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంట్లోనే బెటర్
ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుని ఆఫీసుకు వెళ్లడం కంటే ఇది బెస్ట్ అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత కూడా కంపెనీలు ఈ సిస్టమ్ కంటిన్యూ చేసే అవకాశం ఉందని యూఎస్ క్లయింట్ బేస్డ్ కంపెనీకి చెందిన టెకీ మధుకర్ చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల రోజులో ఓ గంట ఎక్కువగా పనిచేసే వీలుంటుందని, కంపెనీలకు ప్రొడక్షన్ వాల్యూ కలిసి వస్తోందని తెలిపారు.
వర్కింగ్ అవర్స్ పెరగొచ్చు
పెద్ద కంపెనీలు 75శాతం ఎంప్లాయీస్తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. రిసోర్సెస్ అంతా ఇంటి వద్దే పని చేస్తున్నా ప్రొడక్షన్కి నష్టం లేదు. కాకపోతే, వర్కింగ్ అవర్స్ పెరిగే అవకాశం కొంత ఉండొచ్చు. లాక్ డౌన్ ఎత్తేసినా వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అయ్యేట్టు కనిపిస్తోంది.
‑ సంతోష్ కుమార్, విప్రో హెచ్ఆర్ మేనేజర్
జూన్ 7వరకు ఇలాగే…
లాక్ డౌన్ స్టార్టింగ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. మొదట్లో సొంత ల్యాప్టాప్తోనే వర్క్చేసినా, 15 రోజుల కిందట కంపెనీ నుంచి వచ్చింది. జూన్ 7 వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని మా టీమ్ లీడర్ చెప్పారు.
– భాను ప్రసాద్, ఐటీ ఎంప్లాయ్