మరో మిస్టీరియస్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌

మరో మిస్టీరియస్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌

‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత సుమంత్, సంతోష్ జాగర్లమూడి  కాంబినేషన్‌‌‌‌లో మరో మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘వారాహి’ టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సోమవారం  హైదరాబాద్‌‌‌‌లోని రామానాయుడు స్టూడియోస్‌‌‌‌లో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌‌‌కి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. నిర్మాత సురేష్​ బాబు కెమెరా స్విచాన్ చేశారు.  సరికొత్త కాన్సెప్ట్‌‌‌‌తో దీన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు మేకర్స్. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ ‘సంతోష్ కథ చెప్పగానే క్లాప్స్ కొట్టాను. మా కాంబినేషన్‌‌‌‌లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ కంటే చాలా బెటర్ స్ర్కిప్ట్ ఇది. కాంతార, కార్తికేయ2 లాంటి డివోషనల్ మిస్టీరియస్‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకుంటుంది’ అన్నాడు. సంతోష్ మాట్లాడుతూ ‘సప్త మాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’ అని  చెప్పాడు. జీకే మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రమాదేవి నారగాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.