టైగర్ నాగేశ్వర రావు చిత్ర నిర్మాత కార్యాలయంపై ఐటీ దాడులు

టైగర్ నాగేశ్వర రావు చిత్ర నిర్మాత కార్యాలయంపై ఐటీ దాడులు

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరో వస్తున్నా టైగర్ నాగేశ్వర రావు(Tiger nageswara rao) మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek agarwal) కార్యాలయంలో ఐటీ సోదాలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో ఈ ఐటీ దాడులు జరిగాయి. అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వరరావు సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. ఇందుకోసం ఆయన చాలా ఎక్కువ మొత్తం ఖర్చు చేశారు. 

ఈ క్రమంలోనే సినిమా కోసం పెట్టిన డబ్బులు ఎక్కడనుండి తీసుకొచ్చారు, దానికి సంబందించిన లావాదేవీలు సరిగా ఉన్నాయా, ఎక్కడైనా పన్ను ఎగవేతలు లాంటివి జరిగాయా అనే నేపధ్యంలోనే ఈ దాడులు నిర్వహించారు అధికారులు. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read :- లిప్ లాక్స్తో రెచ్చిపోయిన రణ్బీర్, రష్మిక

ఇక టైగర్ నాగేశ్వర రావు సినిమా విషయానికి వస్తే.. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నురూప్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీ రోల్ లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను దక్కించుకుంటుందో చూడాలి.