దళితులను అవమానిస్తే ఊరుకోం : తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ

దళితులను  అవమానిస్తే ఊరుకోం : తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ
  •     అక్బరుద్దీన్ పై ప్రజా సంఘాల జేఏసీ ఫైర్ 
     

ఖైరతాబాద్, వెలుగు: దళితులను అవమానిస్తే ఊరుకోబోమని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేను  అవమానించిన అక్బరుద్దీన్​ ఒవైసీకి తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ నేత,  జేఏసీ చైర్మన్​గజ్జెల కాంతం  హెచ్చరించారు.  ఉన్నతవిద్యావంతుడైన డాక్టర్​ కవ్వంపల్లి సత్యనారాయణను అవమానించే ముందు అక్బరుద్దీన్  తన గురించి ఓ సారి​ఆలోచించుకోవాలని అన్నారు.  

దళిత ,బీసీ సామాజిక వర్గాల జోలికి వస్తే దాడులు జరుగుతాయని చెప్పారు. ఎమ్మెల్యే సత్యనారాయణకు ఒవైసీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు.  శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ కు ..  ఎంఐఎం  బీ టీంగా పనిచేస్తోందని గజ్జెల కాంతం తెలిపారు.  అందుకే ఒవైసీ నేతలపై ఈడీ దాడులుగాని, సీబీఐ, పోలీసు కేసులుగాని  లేవని వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్​ తెలంగాణ తానే తెచ్చానన్న భ్రమలో ఉన్నారని, తెచ్చింది తెలంగాణ ఉద్యమకారులైతే ,  ఇచ్చింది కాంగ్రెస్ అని వివరించారు.