మా కుటుంబంలో చీలికలు రావడానికి రివాబానే కారణం: జడేజా తండ్రి ఆవేదన

మా కుటుంబంలో చీలికలు రావడానికి రివాబానే కారణం: జడేజా తండ్రి ఆవేదన

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్ గా తన కెరీర్ ను విజయవంతగా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జడేజా గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇదిలావుంటే, తాజాగా జడేజాకు.. తన తండ్రి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదురయ్యాయి.

జడేజా తండ్రి అనిరుధ్‌సింగ్.. రివాబాతో వివాహం జరిగిన నాటి నుంచి తన కొడుకుతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. కుటుంబంలో చీలికలు రావడానికి రివాబా కారణమని ఆయన ఆరోపించారు. అదే ఊరిలో ఉంటున్నప్పటికీ తన కొడుకు ముఖం కూడా చూడడం లేదని ఆయన తెలిపారు.

జడేజా అతని భార్య రివాబాతో మాకు, మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. మేము వారిని పిలవము. వారు మాకు కాల్ చేయరు. వారి పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సమస్యలు మొదలయ్యాయి. నేను ప్రస్తుతం జామ్‌నగర్‌లో ఒంటరిగా ఉంటున్నాను. జడేజా తన స్వంత బంగ్లాలో నివసిస్తున్నాడు. అతను అదే నగరంలో నివసిస్తున్నా.. నేను వారి దగ్గరికి వెళ్ళను. అతని భార్య ఏమి  చేసిందో నాకు తెలియదు. అతని మనస్సు మార్చేసింది. నేను అతనికి పెళ్లి చేయకున్నా బాగుండేది. అతను క్రికెటర్‌గా మారకుండా ఉంటే ఇంకా బాగుండేది. అలా చేసుంటే ఇప్పుడు ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదని జడేజా తండ్రి ఆరోపించారు. 

  పెళ్లయిన మూడు నెలల్లోనే అన్నీ తన పేరు మీదకు మార్చుకోవాలని చెప్పింది. మా కుటుంబంలో చీలిక తెచ్చింది. కుటుంబం అక్కర్లేదు, స్వతంత్ర జీవితాన్ని కోరుకుంది. ఐదేళ్లుగా మా మనవరాలి మొహం కూడా చూడలేదు. అని జడేజా తండ్రి అన్నారు.