సంగారెడ్డి టౌన్, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతోనే గెలిచామని టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్జగ్గారెడ్డి అన్నారు. శనివారం కొండాపూర్ మల్కాపూర్ పరిధిలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మొదటి విడతలో గెలిచిన, ఓడిన కాంగ్రెస్అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోయినప్పటికీ కాంగ్రెస్ కండువాతో గెలిచినా, ఓడినా తనకు సర్పంచ్ లే అని ముందే చెప్పానని గుర్తు చేశారు. గెలిచిన వారిని టీజీ ఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఓడిన వారికి తాను సన్మానం చేస్తానని చమత్కరించారు. నియోజకవర్గంలో 45 పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారన్నారు.
గెలిచిన అభ్యర్థులు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రెబల్గా పోటీ చేసిన వారికి పార్టీలో అవకాశం లేదన్నారు. ఇండిపెండెంట్గా గెలిచిన వారు కాంగ్రెస్ లోకి రావాలనుకుంటే బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నాయకుల నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
