'వీరసింహారెడ్డి' నుంచి జై బాలయ్య సాంగ్ రిలీజ్

'వీరసింహారెడ్డి' నుంచి జై బాలయ్య సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'వీరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నాడు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'జై బాలయ్య' ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, కరీముల్లా పాడాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వైట్ డ్రెస్ లో, మీసం మెలేసి, మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్ తో చిరునవ్వులు చిందిస్తున్న బాలయ్య ఈ పాటలో కనిపిస్తున్నాడు. 'రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు' అంటూ సాగిన ఈ పాట బాలయ్య అభిమానులకు పండుగ అనే చెప్పాలి. 

భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలయ్య సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా.. కన్నడ నటుడు దునియా విజయ్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.