JAIHANUMAN: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్' అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్‍ డేట్ ఫిక్స్.. ప్రొడక్షన్ హౌస్ ఛేంజ్

JAIHANUMAN: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్' అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్‍ డేట్ ఫిక్స్.. ప్రొడక్షన్ హౌస్ ఛేంజ్

జై హనుమాన్(Jai Hanuman).. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ చూపులన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. హనుమాన్(HanuMan) సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి.

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరెకక్కించిన ఈ సినిమాటిక్ బ్రిలియన్స్కు ఇండియన్ ఆడియన్స్తో పాటు ఓవర్ సీస్ ఆడియన్స్ సైతం నోరెళ్లబెట్టారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో ఆ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ను క్రియేట్ చేసి సినీ దిగ్గజాలతో సైతం శభాష్ అనిపించుకున్నాడు ప్రశాంత్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక హనుమాన్ సినిమా చివర్లో సీక్వెల్గా జై హనుమాన్ను ప్రకటించి ఆడియన్స్ అదిరిపోయే షాకిచ్చాడు ప్రశాంత్ వర్మ. 

ALSO READ | ANRAwards: వారికి రుణపడి ఉంటా.. ఏఎన్నార్‌ జాతీయ అవార్డు వేడుకపై చిరంజీవి, నాగార్జున ఎమోషనల్ పోస్ట్

లేటెస్ట్గా మంగళవారం (అక్టోబర్ 29న) జై హనుమాన్ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఏ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుందో ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్‍ డేట్‍ను కూడా ప్రకటించారు.

"ఈ దీపావళి, శౌర్య జ్వాలలను పునరుజ్జీవింపజేసే మరియు భారతీయ ఇతిహాసాలను గౌరవించే కథతో ఇతిహాసాలకు జీవం పోస్తోంది" అంటూ తెలిపారు. కాగా జై హనుమాన్ మూవీ నుంచి రేపు బుధవారం (అక్టోబర్ 30) ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. 

అయితే హనుమాన్ మూవీని నిర్మించిన నిరంజన్ రెడ్డి ప్రైమ్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్ మూవీని టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మరి ఈ బ్యానర్ మారడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా ఒక స్టార్ హీరో కనిపిస్తారని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ స్టార్ హీరో ఎవరో కాదట. కన్నడ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) అని తెలుస్తోంది. అవును జై హనుమాన్ హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా కనిపించేది కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి  అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

కాంతారా భారీ సక్సెస్ తరువాత.. రిషబ్ శెట్టి ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఈ సినిమా కోసం రిషబ్ శెట్టిను తీసుకోనున్నాడట ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.ఈ వార్త గనక నిజమైతే.. జై హనుమాన్ భారీ విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.